మారేడుమిల్లి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్ లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఇక్కడికి హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం […]

మారేడుమిల్లి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి

విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్ లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఇక్కడికి హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఎక్కువగా సందర్శకులు తెల్లవారేసరికి ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు.
విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మీ వీకెండ్ లో మారేడుమిల్లి సందర్శనకు వెళ్లాలనుకుంటే అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.

జలతరంగిణి జలపాతాలు

మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది. దారి మద్యలో సీతపల్లి వద్ద వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు.
సీతపల్లి దాటి 5 కిలోమిటర్లు వెళితే సీతపల్లి వాగు, పాలవాగు అక్కడ సేదతీరే ఏర్పాట్లు ఉన్నాయి.

అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం
దగ్గరలో రంప జలపాతం వేసవిలో తక్కువగా జలదార ఉంటుంది, కాబట్టి జులై ఆగస్టు లో వెళితే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు.

ఈ ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ&ప్రైవేట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి

రంపచోడవరంకి 4 కి. మీ. దూరంలో శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం ఉంటుంది. ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయంలోనే పూజలు చేసేవారని చెబుతారు.

స్వర్ణధార - రంప జలపాతాలు

జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.

అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్ లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం యొక్క నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

కార్తీక వనం,
వాలీ సుగ్రీవ ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతం

కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్ సైట్

ఈ ప్రదేశానికి రామాయణాని కి సంబంధం ఉందంటారు ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారు. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది మనకి.

మదనికుంజ్ విహారస్థల్

మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.

అత్యద్బుత అందంగా కనిపిస్తూ ఉరించే విదంగా ఉండే పాములేరు జలాశయం మనకి ఎదురవుతుంది. చాలా అందంగా ఉంటుంది. ఎంతో ప్రమాదకరమైనది అక్కడ ఈతకు దిగి ఎంతో ప్రాణలు కోల్పోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈ మజిలీలో మారేడు మిల్లిలో అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే బోంగు చికెన్ రుచి చూడండి. ఆ చికెన్ తింటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే అంత రుచి ఉంటుంది. బస చెయ్యడానికి AP టూరిజం హరితా రిసార్ట్స్, ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి.

దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు View పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు, రెండవ View పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే
అక్కడే సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది.

ఫ్యామిలీ-ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వెహకల్ కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా రిపేరు వచ్చినా దగ్గరలో మెకానిక్ దోరకని పరిస్దితి ఉంటుంది.

రాత్రి ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు. చీకటి పడేలోపు ఏదైనా ప్రదేశానికి చేరుకునేలా చూసుకోండి.

Updated On 15 April 2021 12:44 PM GMT
subbareddy

subbareddy

Next Story