శ్రీవారిసేవలో శ్రీ పరిపూర్ణానందస్వామి
మిరాశీ అర్చకుల వ్యవస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుకు చెల్లించుకున్నారు..ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు..ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్వయం ప్రతిపత్తితో గ్రామా గ్రామాన ఒక శక్తి వంతంగా విస్తరంచి సుమారు 8వేల గ్రామాలను హిందుత్వం వైపు 6 ప్రాజెక్టులు నడిపాయని గుర్తు […]
మిరాశీ అర్చకుల వ్యవస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుకు చెల్లించుకున్నారు..ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు..ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్వయం ప్రతిపత్తితో గ్రామా గ్రామాన ఒక శక్తి వంతంగా విస్తరంచి సుమారు 8వేల గ్రామాలను హిందుత్వం వైపు 6 ప్రాజెక్టులు నడిపాయని గుర్తు చేసారు..ఆరు ప్రాజెక్టులను ధర్మప్రచార పరిషత్ లో విలీనం చేయడం సబబు కాదని,టీటీడీ వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు..అప్పటి ఈవో పీవీఆర్కే ప్రసాద్ వాడవాడలా శ్రీవారి నామస్మరణ మారు మ్రోగేలా మహానుభావుల సహకారంతో ఈ ఆరు ప్రాజెక్టులు రూప కల్పన జరిగిందని,ధర్మప్రచార పరిషత్ లో ఆరు ప్రాజెక్టులను విలీనం చేయరాదని ఈవోకు., టీటీడీ పాలకమండలి విజ్ఞప్తి చేసారు..విలీనం చేస్తాం అంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు..