విధాత‌: విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేసినప్పుడు పదేపదే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముంది? వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 మాసాల కాలంలో దాదాపు రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపింది.విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరో రూ.3699 కోట్ల గుదిబండ ప్రజలపై వేసింది.బొగ్గు నిల్వలు లేకపోవటంవల్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని రాష్ట్ర […]

విధాత‌: విద్యుత్ కొనుగోళ్లలో ఎంత ఆదా చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.విద్యుత్ కొనుగోళ్లలో ఆదా చేసినప్పుడు పదేపదే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముంది?

వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 మాసాల కాలంలో దాదాపు రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపింది.విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరో రూ.3699 కోట్ల గుదిబండ ప్రజలపై వేసింది.బొగ్గు నిల్వలు లేకపోవటంవల్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.కాని 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలు కట్టిపెట్టాలి.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బొగ్గు సరఫరా అయ్యే విధంగా చూడాలన్నారు రామకృష్ణ.

Updated On 12 Oct 2021 5:37 AM GMT
subbareddy

subbareddy

Next Story