అమరావతి రైతుల మహా పాదయాత్ర కు సిపిఐ మద్దతు
విధాత: అమరావతి రైతుల మహా పాదయాత్ర కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అనే మహా పాదయాత్రకు అమరావతి రైతులు నడుంబిగించారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.మహా పాదయాత్రకు అనుమతిపై […]
విధాత: అమరావతి రైతుల మహా పాదయాత్ర కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అనే మహా పాదయాత్రకు అమరావతి రైతులు నడుంబిగించారు.
ఇప్పటికే అమరావతి ప్రాంతంలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరవాలి,అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని వెల్లడించారు రామకృష్ణ.