• జగన్మోహన్ రెడ్డి బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నాడు.• బాంచన్ దొరా అని వైసీపీనేతలు, వాలంటీర్లు చుట్టూ బీసీలంతా తిరిగేలా చేస్తున్నాడు.• జగన్ ప్రభుత్వంలో బీసీలసంక్షేమం కేవలం కాగితాలు, అంకెలకే పరిమితం.• చంద్రబాబునాయుడి హాయాంలో, ఆదరణకింద చేతి, కులవృత్తుల వారికి 90శాతం సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు అందించారు.• విదేశాలకు వెళ్లి చదువుకునే బీసీ యువతకు రూ.15లక్షలవరకుఅందించారు.• స్టడీ సర్కిళ్లు,కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, బీసీ నిరుద్యోగయువతకు ఉచితంగా శిక్షణ అందించారు.• మత్స్యకారులకు 75శాతం సబ్సిడీపై వలలు, పడవలు, మరబోట్లు, […]

• జగన్మోహన్ రెడ్డి బీసీలను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నాడు.
• బాంచన్ దొరా అని వైసీపీనేతలు, వాలంటీర్లు చుట్టూ బీసీలంతా తిరిగేలా చేస్తున్నాడు.
• జగన్ ప్రభుత్వంలో బీసీలసంక్షేమం కేవలం కాగితాలు, అంకెలకే పరిమితం.
• చంద్రబాబునాయుడి హాయాంలో, ఆదరణకింద చేతి, కులవృత్తుల వారికి 90శాతం సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు అందించారు.
• విదేశాలకు వెళ్లి చదువుకునే బీసీ యువతకు రూ.15లక్షలవరకుఅందించారు.
• స్టడీ సర్కిళ్లు,కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, బీసీ నిరుద్యోగయువతకు ఉచితంగా శిక్షణ అందించారు.
• మత్స్యకారులకు 75శాతం సబ్సిడీపై వలలు, పడవలు, మరబోట్లు, మోపెడ్లు అందించారు.
• చేనేతవర్గానికి రుణమాఫీ చేశారు.
• బీసీభవన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చంద్రబాబునాయుడు ఒక్కో నియోజకవర్గానికి రూ.50లక్షలు కేటాయించారు.
• 2018-19లో బీసీల సంక్షేమానికి రూ.16,226కోట్లు ఖర్చుపెట్టారు.
• జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలను విడదీసి పాలిస్తున్నాడు.
• వారు ఐక్యంగా ఉంటే తనఆటలు సాగవని భయపడుతున్నాడు.
• బీసీ నాయకత్వాన్ని అణిచేసి, బీసీలు ఎల్లకాలం కిందిస్థాయిలోనే ఉండేలా చేస్తేన్నాడు.
• జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన 56 బీసీ కార్పొరేషన్లు అడ్రస్ లేనివిగా మిగిలిపోయాయి.
• చంద్రబాబునాయుడు ప్రతి బీసీ కార్పొరేషన్ , ఫెడరేషన్ కు ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తే, ఈముఖ్యమంత్రి బీసీ నిధులను దారిమళ్లిస్తున్నాడు.
• నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటే, ముఖ్యమంత్రి వేలల్లో అరకొర సాయం చేస్తున్నాడు.
• స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించింది జగన్మోహన్ రెడ్డే.
• దానివల్ల బీసీలు రాష్ట్రంలో 16,800 స్థానికసంస్థల పదవులను కోల్పోయారు.
• నామినేటెడ్ పదవులు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో జగన్ కు బీసీలు గుర్తురాలేదా?
• టీటీడీ ఛైర్మన్, ఏపీఐఐసీ ఛైర్మన్ వంటివి టీడీపీహాయాంలో బీసీలకే దక్కాయి.
• అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమలరామకృష్ణుడుసహా, నాపై తప్పుడుకేసులుపెట్టారు.
• బీసీలు పస్తులుంటారు గానీ, ఆత్మాభిమానం చంపుకోరనే వాస్తవాన్ని జగన్ తెలుసుకోవాలి

-కొల్లు రవీంద్ర

Updated On 3 Jun 2021 7:20 AM GMT
subbareddy

subbareddy

Next Story