రుయా ఆస్పత్రి మరణాలపై హైకోర్టులో విచారణ
విధాత:అమరావతి :తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 50 మంది మృతి చెందితే 11 మందేనని ప్రభుత్వం పేర్కొనటంపై పిటిషనర్ జీబీపీ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి మరణాలను గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. వేసవి సెలవు అనంతరం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగనుంది.
విధాత:అమరావతి :తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 50 మంది మృతి చెందితే 11 మందేనని ప్రభుత్వం పేర్కొనటంపై పిటిషనర్ జీబీపీ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ అందక చనిపోయిన వారి మరణాలను గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. వేసవి సెలవు అనంతరం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగనుంది.