రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..! 26వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ను జారీ చేసింది. విజయవాడ-గుంతకల్ మార్గంలో మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

విధాత : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ను జారీ చేసింది. విజయవాడ-గుంతకల్ మార్గంలో మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తిరుపతి - బిట్రగుంట మార్గంలో ఈ నెల 20 నుంచి 26 మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238) రైళ్లను 20 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి-కాట్పాడి (07659), కాట్పాడి-తిరుపతి (07582) స్పెషల్ ప్యాసింజర్ రైళ్ల నుంచి 20 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
అలాగే కాట్పాడి-జోలార్పేట (06417), జోలార్పేట-కాట్పాడి (06418) మెమో రైళ్లను ఈ నెల 20 నుంచి 26 వరకు, అరక్కోణం-కడప (06411), కడప-అరక్కోణం (06401) స్పెషల్ మెమో రైళ్లు ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు చేసినట్లు తెలిపింది. మరో వైపు విల్లుపురం-తిరుపతి (16854) ఎక్స్ప్రెస్ ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడువనుండగా.. తిరుపతి-విల్లుపురం (16853) ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులు కాట్పాడి నుంచి విల్లుపురం వరకు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
