విధాత‌,విశాఖ : హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని శ్రీనివాసానంద స్వామి అన్నారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే స్పందన ఏదని స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో చూశామన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు మళ్లీ అదేరీతిలో మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు […]

విధాత‌,విశాఖ : హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని శ్రీనివాసానంద స్వామి అన్నారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే స్పందన ఏదని స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో చూశామన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు మళ్లీ అదేరీతిలో మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా దేవాదాయశాఖ మంత్రి మాట్లాడరెందుకని స్వామి ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన పై 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామన్నారని, కానీ ఏమైందని శ్రీనివాసానంద స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. దేవాలయాలకు పట్టిన దుస్ధితిపై విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరని శ్రీనివాసానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 30 Jun 2021 6:59 PM GMT
subbareddy

subbareddy

Next Story