విధాత: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరితోటల్లో పనిచేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వజ్రపుకొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరావు, సంతోష్, తులసీదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఎలుగు దాడిలో 10 పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ విషయంపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. ఎలుగుబంట్ల నివారణకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.