విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16,300 మార్క్‌ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు […]

విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16,300 మార్క్‌ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.టెక్‌ మహీంద్రా,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,ఎస్‌బీఐ,బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందాల్కో,సిప్లా,రిలయన్స్‌ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Updated On 9 Aug 2021 6:40 AM GMT
Venkat

Venkat

Next Story