విధాత:తనను ప్రేమించి పెళ్లిచేసుకుని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత భర్త వదిలి వెళ్లిపోయాడని పూతలపట్టు మండలం మద్దులయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక కన్నీటిపర్యంతమైంది. గురువారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్, తాను బంగారుపాళ్యం సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డామని చెప్పారు. తాను గర్భవతి అనే విషయం పెద్దలకు తెలియడంతో ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన వివాహం చేశారన్నారు. వారం రోజులపాటు ఇద్దరూ కలసి ఉన్నామని […]
విధాత:తనను ప్రేమించి పెళ్లిచేసుకుని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత భర్త వదిలి వెళ్లిపోయాడని పూతలపట్టు మండలం మద్దులయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక కన్నీటిపర్యంతమైంది. గురువారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్, తాను బంగారుపాళ్యం సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డామని చెప్పారు.
తాను గర్భవతి అనే విషయం పెద్దలకు తెలియడంతో ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన వివాహం చేశారన్నారు. వారం రోజులపాటు ఇద్దరూ కలసి ఉన్నామని చెప్పారు. కాగా ఏప్రిల్ 23వ తేదీ వినోద్ బంధువులు అతన్ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. తమ కులాలు వేరుకావడంతో వినోద్ తల్లిదండ్రులు తమ వివాహాన్ని అంగీకరించలేదని చెప్పారు. కాగా జూన్ 4వ తేదీ తనకు పాప పుట్టిందనిచెప్పారు. తనకు న్యాయం చేయాలని కోరుతో కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చానని, బంగారుపాళ్యం, పూతలపట్టు, చిత్తూరు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.