శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు …అది ఆయన పుట్టినరోజు కూడా . చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం . మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం . శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ? నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు , […]

శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు …అది ఆయన పుట్టినరోజు కూడా .
చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం .
మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం .
శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా
నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ?
నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన
చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు , ఆద్యుడు
ఆ దివ్య ముహూర్త రూపకర్త , సృష్టికర్త భక్తరామదాసు .
ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం .
రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు . అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు . భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు
అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి .(శ్రీరంగం మాదిరిగా ).
పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు . అదే చైత్ర శుద్ధ నవమి . అవతార పురుషులు , దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన …."ఎస్య అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్ ". ( పరమ పురుష సంహిత )
అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం .
రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు .
ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం . అందుకు ఆద్యుడు , రూపకర్త , ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు .
వాల్మీకి రామాయణం లో కానీ , పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు .
నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా
శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ….ఆ ముహూర్తనిర్ణయ
స్థల
కేంద్ర బిందువు భద్రాచలం కాగా , ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు 🙏
భద్రాచలం లో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నం లో నిర్వహిస్తారు . అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం ….ఇది దోషరహిత ముహూర్త సమయం …..దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు .
అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక

Updated On 20 April 2021 4:51 AM GMT
subbareddy

subbareddy

Next Story