Minister Vivek | ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలి
భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విడుదల చేశారు.
విధాత :
భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలి అందులో న్యూట్రిషన్ ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని వెల్లడించారు. గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కాక వెంకటస్వామి కట్టించారని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో మత్స్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని తెలిపారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకట స్వామి హామినిచ్చారు. మీ అందరికోసం భీమారంలో సొసైటీ కోసం భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫిష్ మార్కెట్ కావాలని వారు కోరారు. విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేయాలని..చెరువు పూడిక తీసి.. చెరువులో చెట్లు తొలగించాలని మంత్రి కోరారు. వారి వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ ప్రారంభించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram