CM KCR |
విధాత: మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
సోమవారం మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి తో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.
ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను అమ్మామని, మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సీఎం కు వివరించారు.
వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభ దాయకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు .