వైరల్‌గా దృశ్యాలు



విధాత : సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లిజంట ఆదివారం క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్ అభిమానులు ఎక్కడ ఏ పని మీద ఉన్న మ్యాచ్ జరుగుతుందంటే చాలు స్కోర్ వివరాలపై ఆసక్తి చూపుతుంటారు. అదే క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న వధువరులు భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు పెళ్లి తంతు పూర్తవ్వగానే ఆదరాబాదరగా తమ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్దకు వచ్చి కొద్ది నిమిషాలు మ్యాచ్ చూసి తిరిగి పెళ్లి వేదికపైగా వెళ్లారు. కొత్త పెళ్లి జంట క్రికెట్ అభిమానం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated On
Subbu

Subbu

Next Story