విధాత: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం సమకూరింది. భక్తుల విరాళాలతో పాటు ఇతర మార్గాల ద్వారా మహాకాళేశ్వర్ టెంపుల్కు ఈ ఏడాది రూ. 81 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారి గణేశ్ ధకడ్ తెలిపారు. 2021, సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 మధ్యలో రూ. 81 కోట్ల ఆదాయం రావడం ఆల్ టైం రికార్డు అని […]
విధాత: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం సమకూరింది. భక్తుల విరాళాలతో పాటు ఇతర మార్గాల ద్వారా మహాకాళేశ్వర్ టెంపుల్కు ఈ ఏడాది రూ. 81 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారి గణేశ్ ధకడ్ తెలిపారు.
2021, సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 మధ్యలో రూ. 81 కోట్ల ఆదాయం రావడం ఆల్ టైం రికార్డు అని చెప్పారు. 2016-17లో రూ. 28 కోట్లు, 2017-18లో రూ. 37 కోట్లు, 2020-21లో 40 కోట్ల ఆదాయం వచ్చింది.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో.. ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైందని గణేశ్ పేర్కొన్నారు. ఇక దర్శనం కూడా వీలైనంత త్వరగా కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ ఆలయం కూడా ఒకటి.