HomelatestTelangana | సంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో 121 మంది ఓట‌ర్లు..!

Telangana | సంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో 121 మంది ఓట‌ర్లు..!

Telangana | 121

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎన్నిక‌ల అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల జాబితాను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌మ కింది స్థాయి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో అధికారులు ఓట‌ర్ల జాబితాను ప్ర‌క్షాళ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. బోగ‌స్ ఓట‌ర్లు భారీగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు ప‌ట్ట‌ణంలో 181 నుంచి 218 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఈ బూత్‌ల‌కు సంబంధించిన ఓట‌ర్ల జాబితాను ప‌రిశీలిస్తుండ‌గా, అత్య‌ధికంగా బోగ‌స్ ఓట‌ర్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

ఒక ఇంట్లో అయితే ఏకంగా 120 మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. బోగ‌స్ ఓట‌ర్ల ఏరివేత ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని ప‌టాన్‌చెరు త‌హ‌సీల్దార్ ప‌ర‌మేశ్ పేర్కొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular