HomelatestCM KCR | ప్రమాద మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్

CM KCR | ప్రమాద మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్

విధాత, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించడం, పలువురు తీవ్ర గాయలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యేను నలమోతు భాస్కర్ రావును సిఎం కేసిఆర్ ఆదేశించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావులు ప్రమాద సంఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరిన మేరకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రుపాయలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియాను సిఎం కేసిఆర్ ప్రకటించారు

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular