Maharashtra బీడ్ జిల్లాలో అత్యధికంగా 180 మంది బలవన్మరణం ఈ వానకాలం సీజన్లో 20.7 శాతం లోటు వర్షపాతం విధాత: బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మరఠ్వాడ రీజియన్లో రికార్డు స్థాయిలో 685 మంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల బలవన్మరణాల్లో బీడ్ జిల్లాలో టాప్లో ఉన్నది. ఈ జిల్లాలో 186 మంది ఆత్మహత్యచేసుకున్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో జూలైన రెండున  మంత్రి బాధ్యతలు చేపట్టిన […]

Maharashtra

  • బీడ్ జిల్లాలో అత్యధికంగా 180 మంది బలవన్మరణం
  • ఈ వానకాలం సీజన్లో 20.7 శాతం లోటు వర్షపాతం

విధాత: బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మరఠ్వాడ రీజియన్లో రికార్డు స్థాయిలో 685 మంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల బలవన్మరణాల్లో బీడ్ జిల్లాలో టాప్లో ఉన్నది. ఈ జిల్లాలో 186 మంది ఆత్మహత్యచేసుకున్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో జూలైన రెండున మంత్రి బాధ్యతలు చేపట్టిన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేది ఈ జిల్లాయే కావడం విశేషం.

ఎనిమిది జిల్లాల మరఠ్వాడ ప్రాంతంలోనే రైతులు అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది జవనరి నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 685 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు డివిజనల్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.

వానకాలం సీజన్ మొదలైన జూన్ నుంచి ఆగస్టు మధ్య మూడు నెలల ఆ కాలంలోనే 294 మంది రైతులు చనిపోయినట్టు ఆ కార్యాలయం తెలిపింది. మరఠ్వాడ ప్రాంతంలో ప్రస్తుతం 20.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 11 వరకు సగటు వర్షపాతం 574.4 మిల్లీమీటర్ల పడాల్సి ఉండగా, 455.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణశాఖ వెల్లడించిం

Updated On 12 Sep 2023 12:03 PM GMT
somu

somu

Next Story