Hyderabad | కుమారులిద్ద‌రికీ మెద‌డు( Brain ) సంబంధిత వ్యాధులు.. ఒకరు పుట్టుక‌తోనే బుద్ధి మాంద్యంతో బాధ‌ప‌డుతుండ‌గా, మ‌రొక‌రికి ఇటీవ‌లే బ్రెయిన్ క్యాన్స‌ర్( Brain Cancer ) నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ ఇద్ద‌రి బిడ్డ‌ల బాధ‌ల‌ను చూడ‌లేక దంప‌తులిద్ద‌రూ తీవ్ర నిర్ణ‌యం తీసుకున్నారు. పిల్ల‌ల‌కు విష‌మిచ్చిన అనంత‌రం దంప‌తులు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్( Hyderabad ) కుషాయిగూడ పోలీసు స్టేష‌న్( Kushaiguda Police ) ప‌రిధిలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి […]

Hyderabad | కుమారులిద్ద‌రికీ మెద‌డు( Brain ) సంబంధిత వ్యాధులు.. ఒకరు పుట్టుక‌తోనే బుద్ధి మాంద్యంతో బాధ‌ప‌డుతుండ‌గా, మ‌రొక‌రికి ఇటీవ‌లే బ్రెయిన్ క్యాన్స‌ర్( Brain Cancer ) నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ ఇద్ద‌రి బిడ్డ‌ల బాధ‌ల‌ను చూడ‌లేక దంప‌తులిద్ద‌రూ తీవ్ర నిర్ణ‌యం తీసుకున్నారు. పిల్ల‌ల‌కు విష‌మిచ్చిన అనంత‌రం దంప‌తులు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్( Hyderabad ) కుషాయిగూడ పోలీసు స్టేష‌న్( Kushaiguda Police ) ప‌రిధిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా( Nizamabad Dist )కు చెందిన గాదే స‌తీశ్‌(39)కు సిద్దిపేట జిల్లా( Siddipeta Dist ) దౌల్తాబాద్‌కు చెందిన వేద‌(35)తో 11 ఏండ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి నిషికేత్‌(9), నిహాల్‌(5) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కందిగూడ‌లోని క్రాంతి పార్కు రాయ‌ల్ అపార్ట్‌మెంట్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. గాదే స‌తీశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి( Software Employee ) కాగా, వేద గృహిణి. నిషికేత్ సైనిక్‌పురిలోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. నిహాల్ పుట్టుక‌తోనే బుద్ధి మాంద్యంతో బాధ‌ప‌డుతుండ‌టంతో స్థానికంగా ఉన్న ఆర్టిజం స్కూల్‌కు వెళ్తున్నాడు.

అయితే నిషికేత్‌కు రెండు నెల‌ల క్రితం తీవ్ర జ్వ‌రం వ‌చ్చింది. దీంతో అత‌న్ని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చూపించ‌గా, బ్రెయిన్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మెద‌డు సంబంధిత వ్యాధులు రావ‌డంతో ఆ దంప‌తులు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. క‌న్న బిడ్డ‌లు ప‌డుతున్న క‌ష్టాన్ని చూడ‌లేక క‌లిసిక‌ట్టుగా చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారేమో ఆ దంప‌తులు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పాల‌ల్లో పొటాషియం సైనెడ్ క‌లిపి ఇచ్చారు. అనంత‌రం స‌తీశ్‌, వేద కూడా అదే సైనెడ్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స‌తీశ్‌, వేద ఫోన్ల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి బంధువులు వ‌చ్చి చూడ‌గా, బెడ్రూంలో విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్న ఆ కుటుంబాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

ప్ర‌శాంతంగా చావ‌నివ్వండి..

‘మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ప్రశాంతంగా చావనివ్వండి.. మమ్మల్ని ఎవరూ బతికించే ప్రయత్నం చేయొద్దు’ అని రాసివున్న నోట్‌ బంధువులు, స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది.

Updated On 26 March 2023 2:20 AM GMT
subbareddy

subbareddy

Next Story