విధాత: సమైక్య రాష్ట్రంలో దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణాలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భునగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గలిగిన గోడౌన్ నిర్మాణానికి సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు నూతనంగా ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించారు. వలిగొండలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ […]

విధాత: సమైక్య రాష్ట్రంలో దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణాలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భునగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గలిగిన గోడౌన్ నిర్మాణానికి సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు నూతనంగా ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించారు. వలిగొండలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం భువనగిరిలో నిర్వహించిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడి తో రికార్డ్ సృష్టించిందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో రైతు సంక్షేమం సాధ్యమైందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతం నుండి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికే పరిమితము కాగా ఇప్పుడు కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో తెలియని వెలితి ఉందన్నారు.

కష్టానికి, పెట్టుబడికి సరిపడా రైతు దిగుబడి సాదించలేకపోతున్న బాధ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడు మాత్రమే ఎకరాకు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూరగాయల మొదలు అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నప్పటికీ మూస పద్దతిలో వ్యవసాయానికి రైతు అలవాటు పడ్డారని ఆయన అన్నారు.

తెలంగాణా ఏర్పడితే రైతును రాజును చెయ్యొచ్చు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే నెరవేరిందని అదే రైతు మరింత సుసంపన్నం కావాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అని ఆయన చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్ర పాలనలో సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి నుండి తెలంగాణా ఏర్పడ్డాక వరుసగా 16 వ మారు నీటిని విడుదల చేసుకున్నాం అంటే ముమ్మాటికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత నే అని ఆయన కొనియాడారు.

రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని మరింత పురోగతిని సాదించేందుకే ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా రైతుబందు పధకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా పేరు ప్రపంచ చిత్రపటంలో మారుమ్రోగుతుందన్నారు. అందుకే వలసల కు కేరాఫ్ గా నిలిచిన మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపస్ రావడమే కాకుండా దేశం నలుమూలల నుండి తెలంగాణా కు వలసల ప్రవాహం జోరందుకుందన్నారు.

మహాబుబ్ నగర్ జిల్లాలో వరి నాట్ల కోసం సరిహద్దున కర్నాటక తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆటోలు,ట్రాలీలు దాటిపోయి లారీలలో నాట్లు వేసేందుకు పొలాలు కోసేందుకు కూలీలు వలసలు వస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో రైతు మకుటంలేని మహారాజు గా వెలుగొందుతున్నారనడానికి అద్దం పడుతుందన్నారు.

స్థానిక సహకార సంఘం అధ్యక్షుడు పరమేశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో Zp చైర్మన్ సందీప్ రెడ్డి, mla ఫైళ్ల శేఖర్ రెడ్డి,కలెక్టర్ పమేలా సత్పతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు .రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, గ్రంధాలయాల సంస్థ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్, dccb చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జడల అమరెందర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరెందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, వలిగొండ ఎంపీపీ నూతి కుమార్, ఎంపిటిసి పలసం రమేష్ , సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, ఆయా మండలాల స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated On 27 March 2023 9:13 AM GMT
Somu

Somu

Next Story