- తదుపరి విచారణ 20కి వాయిదా
విధాత: రోడ్షోలు, ర్యాలీలు నిషేధిస్తూ..ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో నం. 1ఉన్నదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.