Postmortem Room | పోస్టుమార్టం రూమ్లో శవాలు కుప్పలుతెప్పలుగా పడిఉంటాయి. పోస్టుమార్టం కాగానే మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్తుంటారు. గుర్తు తెలియని డెడ్ బాడీస్ను ఆ గదిలోనే వదిలేస్తుంటారు. అలా శవాలు కుప్పలుతెప్పలుగా పడి ఉంటాయి. అయితే ఓ మార్చురీ గదిలో కట్టెల నిచ్చెన ఐదారు అడుగులు నడిచింది. నిచ్చెన తనంతట తానే ముందుకు కదలడాన్ని చూసి సిబ్బంది షాక్కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, […]

Postmortem Room |
పోస్టుమార్టం రూమ్లో శవాలు కుప్పలుతెప్పలుగా పడిఉంటాయి. పోస్టుమార్టం కాగానే మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్తుంటారు. గుర్తు తెలియని డెడ్ బాడీస్ను ఆ గదిలోనే వదిలేస్తుంటారు. అలా శవాలు కుప్పలుతెప్పలుగా పడి ఉంటాయి.
అయితే ఓ మార్చురీ గదిలో కట్టెల నిచ్చెన ఐదారు అడుగులు నడిచింది. నిచ్చెన తనంతట తానే ముందుకు కదలడాన్ని చూసి సిబ్బంది షాక్కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీలోని ఎస్ఆర్ఎంఎస్ మెడికల్ కాలేజీలోని మార్చురీ గదిలో వెదురు కట్టెలతో తయారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఆ నిచ్చెన ఉన్నట్టుండి.. మనషుల మాదిరిగానే నడక సాగించింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
గుండె ధైర్యం లేని వ్యక్తులు ఈ వీడియో క్లిప్ను చూడవద్దని ఆ పోస్ట్లో హెచ్చరించాడు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. దెయ్యాలు, లేదా ఆత్మలు ఆ నిచ్చెనను నడిపించినట్లు కొందరు అనుమానించారు. గ్రాఫిక్ మాయాజాలమని మరికొందరు కామెంట్ చేశారు.
कमजोर दिल वाले दूर रहें…
बरेली (उत्तर प्रदेश) के SRMS मेडिकल कॉलेज के पोस्टमार्टम हाउस में अपने चारों टांगों से सीढ़ी चलने का वीडियो वायरल हो रहा है। pic.twitter.com/Up9BHq4ChB— Arvind Chotia (@arvindchotia) August 29, 2023
