Bangalore | విధాత: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు భర్త. అక్క కొడుకుతో తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bangalore) లోని బసవేశ్వర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బసవేశ్వర నగర్ పీఎస్ పరిధిలోని మంజునాథ నగర్కు చెందిన అయ్యప్ప, నాగరత్న దంపతులకు 12 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు […]
Bangalore |
విధాత: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు భర్త. అక్క కొడుకుతో తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bangalore) లోని బసవేశ్వర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బసవేశ్వర నగర్ పీఎస్ పరిధిలోని మంజునాథ నగర్కు చెందిన అయ్యప్ప, నాగరత్న దంపతులకు 12 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు భూమిక, కుమార్. అయితే నాగరత్న బట్టల దుకాణంలో పని చేస్తుండగా, భర్త అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం నుంచి భార్యపై అనుమానం పెట్టుకున్నాడు భర్త. నాగరత్న నిత్యం ఫోన్లోనే మాట్లాడుతుండటంతో.. ఆమెతో గొడవ పడేవాడు. అంతే కాకుండా అయ్యప్ప అక్క కుమారుడు చంద్రు ఇంటికి వచ్చినప్పుడల్లా నాగరత్న అతనితో సన్నిహితంగా ఉండేది. ఇది అయ్యప్ప కంటపడింది.
ఇంకేముంది భర్త రగిలిపోయాడు. చంద్రు ఇంటి నుంచి వెళ్లిన మూడు రోజులకు.. భార్య నాగరత్నతో అయ్యప్ప గొడవకు దిగాడు. నిద్రలో ఉన్న భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి నాగరత్న ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అయ్యప్ప కోసం గాలిస్తున్నారు. అయ్యప్పను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.