మోదీని చంపేందుకు సిద్ధం కండి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
విధాత: ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజా పటారియా పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటే మోదీని చంపాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా పొవైలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత రాజా పటారియా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. […]
విధాత: ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజా పటారియా పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటే మోదీని చంపాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా పొవైలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత రాజా పటారియా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. దీంతో రాజా పటారియా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాజా పటారియా వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆయనపై కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించింది. మోదీ పట్ల చేసిన వ్యాఖ్యలు క్షమించరాని నేరం అని కేంద్ర మంత్రి ఒకరు పేర్కొన్నారు. రాజా పటారియా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.