Nalgonda విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పార్టీ పిలుపు మేరకు నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి కార్యాలయం ముందు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠించి శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు గోలిమధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ.. మైనార్టీ […]

Nalgonda

విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పార్టీ పిలుపు మేరకు నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి కార్యాలయం ముందు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠించి శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ నాయకులు గోలిమధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ.. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పడం దారుణమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్ , యాదగిరి చారి, సాంబయ్య, భూపాల్ రెడ్డి.భవానీ ప్రసాద్, పాలకూర రవి,, కాశమ్మ, హైమ, తార,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 5 May 2023 2:19 PM GMT
Somu

Somu

Next Story