Mumbai | త‌న త‌ల్లిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్య‌క్తిని ఆమె కుమారుడు అతి కిరాత‌కంగా చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కందివాళి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇరానీవాడిలో ఓ మ‌హిళ నివాస‌ముంటుంది. అయితే ఆమెను 43 ఏండ్ల అబ్దుల్ ర‌హీం మాలిక్ గ‌త కొంత‌కాలం నుంచి లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. ఆదివారం ఉద‌యం కూడా ఆమెను అస‌భ్య […]

Mumbai | త‌న త‌ల్లిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్య‌క్తిని ఆమె కుమారుడు అతి కిరాత‌కంగా చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కందివాళి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇరానీవాడిలో ఓ మ‌హిళ నివాస‌ముంటుంది. అయితే ఆమెను 43 ఏండ్ల అబ్దుల్ ర‌హీం మాలిక్ గ‌త కొంత‌కాలం నుంచి లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. ఆదివారం ఉద‌యం కూడా ఆమెను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడు. ర‌హీంపై బాధిత మ‌హిళ కందివాళి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఇక ఈ విష‌యం బాధితురాలి కుమారుడికి తెలిసింది. ఆదివారం రాత్రి ర‌హీంకు, బాధితురాలి కుమారుడికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయిన కుమారుడు.. ర‌హీం మెడ‌, త‌ల‌పై స్క్రూ డ్రైవ‌ర్‌తో దాడి చేసి చంపాడు.

ర‌హీంను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం క‌న్నుమూశాడు. దీంతో 17 ఏండ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు.

Updated On 7 Jun 2023 4:33 PM GMT
subbareddy

subbareddy

Next Story