Chiyaan Vikram: హీరో విక్రమ్కి ప్రమాదం.. ఏం జరిగిందంటే?
Chiyaan Vikram విధాత: విలక్షణ హీరో చియాన్ విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2 చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగా.. తన తదుపరి చిత్రమైన ‘తంగలాన్’ కోసం ఆయన రిహార్సల్స్లో పాల్గొన్నారు. ఎటువంటి కష్టమైన పాత్రనైనా డూప్ లేకుండా చేసే విక్రమ్.. ఈ సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రను చేస్తున్నారు. ఆ విషయం ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి యాక్షన్స్ పార్ట్ని రిహార్సల్స్ […]
Chiyaan Vikram
విధాత: విలక్షణ హీరో చియాన్ విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2 చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగా.. తన తదుపరి చిత్రమైన ‘తంగలాన్’ కోసం ఆయన రిహార్సల్స్లో పాల్గొన్నారు. ఎటువంటి కష్టమైన పాత్రనైనా డూప్ లేకుండా చేసే విక్రమ్.. ఈ సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రను చేస్తున్నారు.
ఆ విషయం ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి యాక్షన్స్ పార్ట్ని రిహార్సల్స్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగినట్లుగా డాక్టర్స్ గుర్తించారు.
ప్రస్తుతం ఆయన డాక్టర్స్ సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. అలా కంగారు పడే వారందరికీ విక్రమ్ ఓ మెసేజ్ పాస్ చేశారు. ‘‘సినిమా రిహార్సల్స్లో గాయమైంది. అంతకు మించి నాకేం కాలేదు.
ఈ గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచించారు. వీలైనంత తొందరలోనే నేను మళ్లీ షూటింగ్లో పాల్గొంటాను. నాపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని విక్రమ్ తన పీఆర్ ద్వారా ఓ మెసేజ్ను విడుదల చేశారు.
ఇటీవల విక్రమ్కు హెల్త్ బాలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై అనేక రకాలుగా అప్పట్లో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఆ సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా అవడంతో.. ఆయన అభిమానులంతా కంగారు పడుతున్నారు. విక్రమ్ విడుదల చేసిన ఈ మెసేజ్తో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక ఆదిత్య కరికాలన్గా విక్రమ్ నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్లోకి చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.