ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న సీతక్క, నాయిని విధాత, వరంగల్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని హన్మకొండ, ములుగు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ములుగులో ఎమ్మెల్యే సీతక్క, హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అలాగే […]

  • ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
  • పాల్గొన్న సీతక్క, నాయిని

విధాత, వరంగల్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని హన్మకొండ, ములుగు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ములుగులో ఎమ్మెల్యే సీతక్క, హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.

కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎం.పి గా పోటి చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, టిపిసిసి అధికార ప్రతినిధి కూచన రవళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated On 28 Dec 2022 4:07 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story