విధాత‌: మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృత‌లు చిలిపిచేడ్ మండ‌లం ర‌హీంగూడకు చెందిన నునావ‌త్ ర‌వీంద‌ర్, నీలా. కాగా వీరికి ఒక కూమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. ర‌వీంద‌ర్ శివంపేట్ మండ‌లంలోని పిలుట్ల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ప్ర‌ధానోపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నారు. స్వ‌గ్రామం నుంచి న‌ర్సాపూర్ […]

విధాత‌: మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృత‌లు చిలిపిచేడ్ మండ‌లం ర‌హీంగూడకు చెందిన నునావ‌త్ ర‌వీంద‌ర్, నీలా. కాగా వీరికి ఒక కూమార్తె, కుమారుడు ఉన్నారు.

కాగా.. ర‌వీంద‌ర్ శివంపేట్ మండ‌లంలోని పిలుట్ల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ప్ర‌ధానోపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నారు. స్వ‌గ్రామం నుంచి న‌ర్సాపూర్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 14 May 2023 4:33 AM GMT
Somu

Somu

Next Story