పిట్టంపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర విధాత: జాతీయ రహదారి 65 విజయవాడ-హైద్రాబాద్ పామనగుండ్ల నుండి వయా పిట్టంపల్లి మీదుగా మర్రిగూడ బైపాస్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పిట్టంపల్లి నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్, నల్గొండ రెండు నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ తక్కువ సమయంలో జిల్లా కేంద్రానికి రావడానికి నార్కెట్ పల్లి, […]

  • పిట్టంపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర

విధాత: జాతీయ రహదారి 65 విజయవాడ-హైద్రాబాద్ పామనగుండ్ల నుండి వయా పిట్టంపల్లి మీదుగా మర్రిగూడ బైపాస్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పిట్టంపల్లి నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్, నల్గొండ రెండు నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ తక్కువ సమయంలో జిల్లా కేంద్రానికి రావడానికి నార్కెట్ పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల గ్రామాల వారికి ఉపయోగకరమైన జాతీయ రహదారి 65 పాములగుండ్ల నుండి పిట్టంపల్లి మీదుగా మర్రిగూడా బైపాస్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై గతంలో అనేక ప్రమాదాలు జరిగి గాయాలపాలై మరణించిన ఘటనలు ఉన్నాయన్నారు. బస్సులు రాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఆటంకం జరుగుతుందని రైతులు ధాన్యం అమ్ముకోవడానికి నల్లగొండకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రోజువారి కూలీలు నల్ల‌గొండకు ఉపాధి నిమిత్తం రావడం కోసం రోడ్డు రవాణా బాగాలేక ఆటోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు, నల్లగొండ, భువనగిరి ఇద్దరు ఎంపీలు ఉన్నా ఈ రోడ్డుకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.

తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ రోడ్డు పరిశీలించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మర్రిగూడ బైపాస్ వరకు చర్లపల్లి చెరువు ఉన్నందున డబల్ రోడ్డు సి.సి వేయాలని కోరారు..

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ పామనగుండ్ల నుండి మర్రిగూడ బైపాస్ వరకు అనుసంధానంగా ఉన్న ఇస్మాంపల్లి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నల్లగొండ నుండి పామనగుండ్ల మీదుగా ఎరసానిగూడెం వరకు బస్సు వెళ్లేదని రోడ్డు బాగు లేకపోవడంతో బస్సులు ఆపివేశారని, ఎరసానిగూడెం వరకు మరమ్మత్తులు చేపట్టి ఆర్టీసీ బస్సు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాల్లబాయిగూడెం నుండి చంద్రగిరి విలాస్ వరకు, చర్లపల్లి నుండి బాధగూడం వరకు లింకు రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషమ్, నల్గొండ పట్టణ కార్యదర్శి ఎండి. సలీం, కట్టంగూరు మండల కార్యదర్శి పెంజర్ల సైదులు ,జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, పిట్టంపల్లి మాజీ సర్పంచ్ ఎన్న నర్సిరెడ్డి , నల్లగొండ పట్టణ, కట్టంగూరు మండల సిపిఎం నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, వంగర సత్తయ్య, దండెంపల్లి సరోజ , ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, కాసర్ల గౌతంరెడ్డి సలివొజు సైదాచారి, మురారి మోహన్ ఉడుగుడ్ల రామకృష్ణ , జాల ఆంజనేయులు పెంజర్ల కృష్ణ గుండాల నరేష్ గంజి నాగరాజు మాదా సైదులు, ఎన్నామల్ల నర్సింహ, గోలి స్వామి, దెవెంద్ర బాబు, గుండమల్ల భిక్షం, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు షోగోని సాయిలు గాదపాక సందీప్ కేశవులు, ఎన్న వెంకట్ రెడ్డి, గాదపాక మధు, నజీర్ మద్దతు ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.

Updated On 9 Jan 2023 2:24 PM GMT
krs

krs

Next Story