Daughter Murder | విధాత‌: ఓ తండ్రి దారుణానికి పాల్ప‌డ్డాడు. కూతురు ప్రియుడితో వెళ్లిపోయింద‌ని చెప్పి.. ఆమెను హ‌త్య చేశాడు. అయితే త‌న కూతురు క‌రెంట్ షాక్‌తో చ‌నిపోయింద‌ని అంద‌ర్నీ న‌మ్మించాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్బ‌న్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హిందూబేలా గ్రామానికి చెందిన ల‌ల్ల‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద కుమార్తె చాందినీ కాగా, చిన్న కూతురు ఆసియా. అయితే […]

Daughter Murder |

విధాత‌: ఓ తండ్రి దారుణానికి పాల్ప‌డ్డాడు. కూతురు ప్రియుడితో వెళ్లిపోయింద‌ని చెప్పి.. ఆమెను హ‌త్య చేశాడు. అయితే త‌న కూతురు క‌రెంట్ షాక్‌తో చ‌నిపోయింద‌ని అంద‌ర్నీ న‌మ్మించాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్బ‌న్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హిందూబేలా గ్రామానికి చెందిన ల‌ల్ల‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద కుమార్తె చాందినీ కాగా, చిన్న కూతురు ఆసియా. అయితే రెండు నెలల క్రితం చాందినీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ స‌భ్యులు వెతికి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. మ‌ళ్లీ 20 రోజుల క్రితం త‌న చెల్లి ఆసియాతో క‌లిసి చాందినీ ఇంటి నుంచి వెళ్లిపోయారు.

అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోవ‌డంతో తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇద్ద‌రు ముంబై (Mumbai)లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని హిందూబేలాకు తీసుకువ‌చ్చారు. అయితే చాందినీ ఓ యువ‌కుడితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు తండ్రికి తెలిసింది. అత‌నితో వెళ్లిపోయింద‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో కూతురు చాందినీని ఇంట్లోని ఓ గ‌దిలో బంధించి చిత‌క‌బాదాడు.

ఆ దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక చాందినీ ప్రాణాలు కోల్పోయింది. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని కూతురు ఆసియాను బెదిరించాడు. క‌రెంట్ షాక్‌తో చాందినీ చ‌నిపోయింద‌ని అంద‌ర్నీ న‌మ్మించాడు. అనంత‌రం ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు. అక్క మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని ఆసియా.. జ‌రిగిన విష‌యాన్ని గ్రామస్తుల‌కు చెప్ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Updated On 28 March 2023 4:29 AM GMT
subbareddy

subbareddy

Next Story