విధాత‌: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో కష్టపడి చేసిన లైగర్ చిత్రం డిజాస్టర్ అయింది. టాలీవుడ్‌కే పరిమితమైన తన ఇమేజీని ఇండియా లెవెల్‌లో చాటుకోవాలని ఈ పాన్ ఇండియా చిత్రంపై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నిరాశల‌య్యాయి. సినిమా డిజాస్టర్ అయింది. దాంతో విజయ్ దేవరకొండ పడిన కష్టం మొత్తం బూడిద పాలయ్యింది. దానికి తోడు సినిమా పెట్టుబడులపై నిఘా వేశారు. పారితోషికం ఎంత తీసుకున్నాడు? ఏ […]

విధాత‌: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో కష్టపడి చేసిన లైగర్ చిత్రం డిజాస్టర్ అయింది. టాలీవుడ్‌కే పరిమితమైన తన ఇమేజీని ఇండియా లెవెల్‌లో చాటుకోవాలని ఈ పాన్ ఇండియా చిత్రంపై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నిరాశల‌య్యాయి.

సినిమా డిజాస్టర్ అయింది. దాంతో విజయ్ దేవరకొండ పడిన కష్టం మొత్తం బూడిద పాలయ్యింది. దానికి తోడు సినిమా పెట్టుబడులపై నిఘా వేశారు. పారితోషికం ఎంత తీసుకున్నాడు? ఏ రూపంలో తీసుకున్నాడు? అని ఈడి, ఐటి అధికారులు విజయ్ దేవరకొండను ఏకంగా 11 గంటలు విచారించారు.

ఇక ఈ చిత్రం తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సమంత హీరోయిన్‌గా నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంపై ఖుషి అనే చిత్రం చేస్తున్నారు. కానీ సమంతకు మయోసైటీస్ వ్యాధి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న సమంత త్వరలో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన‌నుంది.

ఇదే సమయంలో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిననూరితో ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. ఇదో పీరియాడిక‌ల్ ఫిల్మ్‌. ఇందులో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తాజాగా సమంత తాను ఖుషీ చిత్రంలో పాల్గొంటానని క్లారిటీ ఇవ్వడంతో గౌతం తిన్ననూరి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని కొందరు భావించారు.

కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఒక వైపు ఖుషీ చిత్రాన్ని చేస్తూనే మరోవైపు గౌతం తిన్ననూరి ప్రాజెక్టును కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండు చిత్రాలతో ఎలాగైనా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలని విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఏమి జ‌రుగుతుందో చూడాలి..

Updated On 9 Feb 2023 1:54 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story