విధాత: ఓ బర్త్డే పార్టీలో దారుణం జరిగింది. నీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. దాహాంతో ఓ చిన్నారి ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయని భావించి, గుటగుట తాగేసింది. దీంతో ఆమె నోరు కాలిపోయింది. మరో పిల్లాడు చేతులు కడుక్కోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో సెప్టెంబర్ 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో మహమ్మద్ అదిల్ కుటుంబానికి చెందిన ఒకరి […]
విధాత: ఓ బర్త్డే పార్టీలో దారుణం జరిగింది. నీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. దాహాంతో ఓ చిన్నారి ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయని భావించి, గుటగుట తాగేసింది. దీంతో ఆమె నోరు కాలిపోయింది. మరో పిల్లాడు చేతులు కడుక్కోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో సెప్టెంబర్ 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో మహమ్మద్ అదిల్ కుటుంబానికి చెందిన ఒకరి బర్త్డే పార్టీ వేడుకలను నిర్వహించారు. ఇక అందరూ ఉల్లాసంగా, ఉత్సాహాంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది.. నీళ్ల బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు.
ఒకబ్బాయి చేతులను కడుక్కోవడంతో.. చేతులు కాలిపోయాయి. మరో చిన్నారి నీళ్లు అనుకోని తాగేయడంతో నోటికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా రెస్టారెంట్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.