మంత్రి తలసాని సోదరులతో సుదీర్ఘ విచారణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ, ఏపీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి నోటీసులు విధాత: క్యాసినో పేరిట నిధుల మళ్లింపునకు పాల్పడ్డారన్నఆరోపణలపై నమోదు చేసిన కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేశ్ యాదవ్లను ఆఫీసుకు పిలిచిన ఈడీ అధికారులు సుదీర్ఘగంగా విచారించారు. అంతేకాకుండా మెదక్ జిల్లాకు చెందిన ఒక నేత కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఏపీకి చెందిన ఓ […]
- మంత్రి తలసాని సోదరులతో సుదీర్ఘ విచారణ
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ, ఏపీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి నోటీసులు
విధాత: క్యాసినో పేరిట నిధుల మళ్లింపునకు పాల్పడ్డారన్నఆరోపణలపై నమోదు చేసిన కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేశ్ యాదవ్లను ఆఫీసుకు పిలిచిన ఈడీ అధికారులు సుదీర్ఘగంగా విచారించారు.
అంతేకాకుండా మెదక్ జిల్లాకు చెందిన ఒక నేత కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఏపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధిని కూడా ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణ, అనంతపురానికి చెందిన ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసినట్లు వినికిడి. నాలుగు నెలల కిందట నమోదైన క్యాసినో కేసు మళ్లీ తెర పైకి రావడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నది.