విధాత: ధనవంతులైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లే ఉప ఎన్నికలు ధనమయం అయ్యాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను సూటిగా ఒక్క మాట అడుగుతున్నా. ఎన్నికలు డబ్బు మయం అయ్యాయని కొందరు ఆక్రోషిస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నేను సూటిగా అడుగుతున్నా.. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత […]
విధాత: ధనవంతులైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లే ఉప ఎన్నికలు ధనమయం అయ్యాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను సూటిగా ఒక్క మాట అడుగుతున్నా. ఎన్నికలు డబ్బు మయం అయ్యాయని కొందరు ఆక్రోషిస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నేను సూటిగా అడుగుతున్నా.. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చాయి. నారాయణఖేడ్, పాలేరు, దుబ్బాక, హుజూర్నగర్, నాగార్జున సాగర్లో ఎక్కడా ఈ పరిస్థితి లేదు? ఎందుకు హుజూరాబాద్లో, మునుగోడులోనే డబ్బులు మయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయ్? వందల కోట్ల రూపాయలు వచ్చినయ్? ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే ధనవంతుడు, కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అనే ధనవంతుడు.. వీళ్లిద్దరు దిగిన తర్వాత ఉప ఎన్నికలు ధనమయమయ్యాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ ఇద్దరి వల్లే ఉప ఎన్నిక కలుషితం..
ఈటల, కోమటిరెడ్డితోనే హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నిక కలుషితమైంది. ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్, హుజూర్నగర్ ఉప ఎన్నికలు ఇదే నల్లగొండ జిల్లాలో జరిగినా ఇలాంటి అడ్డమైన ఆరోపణలు రాలే. ఇక్కడ మాత్రమే వచ్చాయి.. తెలంగాణ ప్రజలను నేను అడుగుతున్నా.. ఆలోచించండి. డబ్బు మయమయ్యాయంటే ఎవరు చేస్తున్నారు.
ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ కాదా? ఇద్దరు ధనవంతులకు వందలకోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మి చేసైనా గెలవండి అని ఆదేశమిచ్చి.. ఈ రోజు ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్నది.. అడ్డంగా దొరికింది బీజేపీ కాదా? నేను చెబుతున్నది వాస్తవం కాదా? మేం అడ్డదారులు తొక్కి ఉంటే.. 40 ఐటీ టీమ్లు, 15 కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులు వీరంతా లేరా? ఇవాళ నోటికివచ్చినట్లు బీజేపీ నేతలు కారుకూతలు కూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు
ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ముండాలి..
ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ముండాలి.. సంస్కారం ఉండాలి. మేము గతంలో దుబ్బాకలో వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో, హుజూరాబాద్లో ఓడిపోయాం.. ఓటమి అనంతరం హుందాగా ఒప్పుకున్నం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఇంగితం, సోయి, సంస్కారం ఉండాలి. ఓడిపోగానే నెపాలు పెట్టి.. నిందలు పెట్టడం.. చిల్లర మల్లర మాటలు మాట్లాడడం.. డబ్బు మయమైపోయిందని ఆక్రోషించడం ఎవరి వల్ల అయ్యింది.
ఒక్క హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లోనే ఎందుకు అయ్యింది? అక్కడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వందల కోట్లు ఇచ్చిన పార్టీ ఏదీ? ఎందుకు జరిగినయ్ ఈ ఉప ఎన్నికలు.. ఇంత స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చు అయ్యిందో భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజు కాంట్రాక్టులు, కాసులు ఇచ్చి వందలకోట్ల రూపాయలతో తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేసినా మా అభ్యర్థి గతంలో కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు.
నల్లగొండ జిల్లా ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం: మంత్రి కేటీఆర్
మునుగోడు ఎన్నికల్లో 97వేల ఓట్లు వచ్చాయి. గతంలో కంటే 23వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది 22వేల ఓట్లతో.. మళ్లీ ఈ రోజు ఆయన ఓడిపోయింది 10వేల పైచీలుకు ఓట్లతో. దాదాపు 33వేలకుపైగా ఓట్లు రివర్సై ఓడిపోయాడంటే.. వారి పార్టీకి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చినట్లు కాదా? అని అడుగుతున్నా అని కేటీఆర్ ప్రశ్నించారు.