రైతు హితమే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి హరీశ్రావు
కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దుంకడం గర్వకారణం రాష్ట్రానికి వచ్చే రూ.40 వేల కోట్లు నిలిపేసిన కేంద్రం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ […]
- కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దుంకడం గర్వకారణం
- రాష్ట్రానికి వచ్చే రూ.40 వేల కోట్లు నిలిపేసిన కేంద్రం
- ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి
విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి సమక్షంలో ఆత్మకమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాగా అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బాయికాడ మీటర్లు పెడ్తలేమని 12 వేల కోట్ల నిధులను కేంద్రం ఆపింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసిందని మంత్రి విమర్శించారు. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారని ఇది సంబురపడే పరిస్థితి అని మంత్రి చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని ఈ కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతున్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వెల్లడించారు.అనంతరం ఆత్మ కమిటీ పాలకవర్గం కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు సూచనలు అందించాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని మంత్రి ప్రకటించారు. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చునని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ములుగు మండలం క్షిరాసాగర్ గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన ఆసుపత్రిని ప్రారంభించి, ఆయన మాట్లాడారు. హంస హోమియో ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయుష్ కి మంచి భవిష్యత్ ఉందన్నారు. మారుతున్న పరిస్థితుల నేపధ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకీ ప్రాధాన్యత పెరుగుతున్నదని, ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారన్నారు.
ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని, (ఆయుష్) ఆయుర్వేదం , యోగ, నాచురోపతీ, యునాని, సిద్ధ, హోమియో ఇందులో దేని ప్రత్యేకత దానిదేనేనని అన్నారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో బస్తీలో పల్లెల్లో వైద్యం అందించేందుకు బస్తీ, పల్లె దవాఖానాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చామన్నారు.
పల్లె దవాఖానాలో పని చేసేందుకు ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తున్నామన్నారు. ఇదే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయుష్ సెక్రెటరీ రాజేష్ కొటేషన్ కూడా పంపడం జరిగిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో వైద్యం పొందేందుకు హెలికాప్టర్లలో పేషెంట్లు వస్తున్నారని, ఆయుష్ వైద్యం పొందేందుకు కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావాలన్నారు.
ఇందుకు అన్ని ఆయుష్ విభాగాలను పటిష్టం చేస్తున్నామన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రి కోసం రూ. 6కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని, సిద్దిపేటలో ప్రారంభించుకున్నట్లే, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో 50 పడకలతో కూడిన ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఇందులో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నెముక కీళ్ల సమస్యలు పక్షవాతం వంటి దీర్ఘ కాలిక సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మెరుగైన వైద్యం తెలంగాణలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచం భారతదేశంలో ఉన్న ఆయుష్ వైద్యం వైపు చూస్తుందని, ప్రపంచంలో మంచి ఆయుష్ వైద్యం అందిస్తున్న దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందన్నారు.
ఇక్కడ ఉండే విద్యార్థులు రేపటి ఆయుష్ వైద్యులుగా సమాజానికి మరింత సేవను అందించేందుకు మంచి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ లాగా అనవసరపు సీ సెక్షన్లు వ్యాప్తి చెందాయని, తల్లి బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అవసరం ఉంటే తప్ప సీ సెక్షన్ చేయవద్దని డాక్టర్లను ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందన్నారు. అనవసరపు సీ సెక్షన్ చేయడం వల్ల తల్లికి మొదటి గంటలో పాలు రాకపోవడం తో పుట్టే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం మనం కోల్పోతున్నామన్నారు.