విధాత: అనుమానంతో ఓ టీచ‌ర్.. ప‌రీక్షా హాల్‌లోనే బాలిక బ‌ట్ట‌ల‌ను బ‌ల‌వంతంగా విప్పించింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై టీచ‌ర్‌కు అనుమానం క‌లిగింది. ఆమె కాపీ కొడుతున్న‌ట్లు అనుమానం రావ‌డంతో.. బ‌ల‌వంతంగా అక్క‌డే బ‌ట్ట‌లు విప్పించింది. యూనిఫాం అంతా చెక్ చేసింది. ఒక్క చిట్టి […]

విధాత: అనుమానంతో ఓ టీచ‌ర్.. ప‌రీక్షా హాల్‌లోనే బాలిక బ‌ట్ట‌ల‌ను బ‌ల‌వంతంగా విప్పించింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై టీచ‌ర్‌కు అనుమానం క‌లిగింది. ఆమె కాపీ కొడుతున్న‌ట్లు అనుమానం రావ‌డంతో.. బ‌ల‌వంతంగా అక్క‌డే బ‌ట్ట‌లు విప్పించింది. యూనిఫాం అంతా చెక్ చేసింది. ఒక్క చిట్టి కూడా బాలిక వ‌ద్ద దొర‌క‌లేదు.


ఇక ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చిన బాలిక తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లిన బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి, స్థానికులు క‌లిసి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. బాధితురాలు, త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On 16 Oct 2022 9:04 AM GMT
subbareddy

subbareddy

Next Story