రిటైర్మెంట్ వ‌ర‌కు ప్ర‌తినెలా పూర్తి జీతం.. దోషుల‌కు క‌ఠిన శిక్ష‌.. అంత్య‌క్రియ‌ల్లో మంత్రులు పాల్గొనాల‌ని ఆదేశం ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం అండంగా ఉంటుంద‌ని సీఎం భ‌రోసా విధాత‌: భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీ‌నివాస‌రావు కుటుంబానికి ప్ర‌తినెల‌ జీతం.. కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం దోషులకు కఠినంగా […]

  • రిటైర్మెంట్ వ‌ర‌కు ప్ర‌తినెలా పూర్తి జీతం..
  • దోషుల‌కు క‌ఠిన శిక్ష‌..
  • అంత్య‌క్రియ‌ల్లో మంత్రులు పాల్గొనాల‌ని ఆదేశం
  • ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం అండంగా ఉంటుంద‌ని సీఎం భ‌రోసా

విధాత‌: భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శ్రీ‌నివాస‌రావు కుటుంబానికి ప్ర‌తినెల‌ జీతం.. కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం

దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ ఆర్ వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సు వరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒక‌రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు .

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఎఫ్ ఆర్ ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎఫ్ ఆర్ ఓ అంత్యక్రియల్లో పాల్గొని, సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

దాడుల‌ను స‌హించం..
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉద్యోగుల‌కు భరోసా ఇచ్చారు.

Updated On 23 Nov 2022 1:07 AM GMT
krs

krs

Next Story