విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం కార్తీక శుద్ధ దశమి ఉ.6.30ని.ల నుండి మ.12.00 గం.ల వరకు యాగశాల ద్వారతోరణార్చన, గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకి, ధ్వజారోహణం, బలిప్రదానం, తీర్ధప్రసాద గోష్టి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం భేరితాడనం, దేవతాహ్వానం తదితర బ్రహ్మోత్సవ ఘట్టాలు అర్చక, వేద పండిత బృందం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి […]

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం కార్తీక శుద్ధ దశమి ఉ.6.30ని.ల నుండి మ.12.00 గం.ల వరకు యాగశాల ద్వారతోరణార్చన, గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకి, ధ్వజారోహణం, బలిప్రదానం, తీర్ధప్రసాద గోష్టి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

సాయంత్రం భేరితాడనం, దేవతాహ్వానం తదితర బ్రహ్మోత్సవ ఘట్టాలు అర్చక, వేద పండిత బృందం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి కట్ట జ్యోతి, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 3 Nov 2022 10:25 AM GMT
krs

krs

Next Story