విధాత: ఓ బాలిక‌పై ఇద్ద‌రు క్రూర మృగాలు విరుచుకుప‌డ్డారు. ఆటో వెళ్తున్న ఆమెపై ఇద్ద‌రు దుండ‌గులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత బాధితురాలిని రోడ్డుపై వ‌దిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో శ‌నివారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 18 ఏండ్ల బాలిక ట్యూష‌న్ ముగించుకుని ఇంటికి బ‌య‌ల్దేరేందుకు సిద్ధ‌మైంది. ఇక ఆటో మాట్లాడుకుని ఇంటికి వ‌స్తోంది. త‌న‌కు తెలిసిన దారిలో కాకుండా, వేరే మార్గంలో […]

విధాత: ఓ బాలిక‌పై ఇద్ద‌రు క్రూర మృగాలు విరుచుకుప‌డ్డారు. ఆటో వెళ్తున్న ఆమెపై ఇద్ద‌రు దుండ‌గులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత బాధితురాలిని రోడ్డుపై వ‌దిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో శ‌నివారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 18 ఏండ్ల బాలిక ట్యూష‌న్ ముగించుకుని ఇంటికి బ‌య‌ల్దేరేందుకు సిద్ధ‌మైంది. ఇక ఆటో మాట్లాడుకుని ఇంటికి వ‌స్తోంది. త‌న‌కు తెలిసిన దారిలో కాకుండా, వేరే మార్గంలో ఆటోను తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆ బాలిక అరిచింది.

ఈ మార్గంలో వ‌ద్దు.. వేరే దారిలో తీసుకెళ్లాల‌ని మొత్తుకున్న‌ప్ప‌టికీ ఆ దుండ‌గులు వినిపించుకోలేదు. ఆ ఆటో డ్రైవ‌ర్‌తో పాటు మ‌రో వ్య‌క్తి క‌లిసి మార్గ‌మ‌ధ్య‌లోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 3 గంట‌ల పాటు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.


ఆ త‌ర్వాత బాధితురాలిని తీవ్రంగా కొట్టి, ఆమె ఫోన్‌ను దొంగిలించారు. ఇక రోడ్డుపై ఆమెను వ‌దిలేసి పారిపోయారు. ఆ త‌ర్వాత స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకుని వెళ్లిన‌ట్లు బాధితురాలు తెలిపింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated On 17 Oct 2022 9:27 AM GMT
subbareddy

subbareddy

Next Story