రైలు - ప్లాట్ ఫామ్ మధ్య ఇరుకున్న విద్యార్థిని.. గంటన్నర నరకయాతన.. మృతి
Duvvada Railway Station| విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న రైలు నుంచి కిందకు దిగుతుండగా.. ఓ విద్యార్థిని కాలు జారింది. దీంతో ఆమె రైలు - ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్లోనే నిలిపివేశారు. బాధిత విద్యార్థినిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితురాలు గంటన్నర పాటు నరకయాతన అనుభవించింది. చివరకు ప్లాట్ ఫామ్ను పగులగొట్టి యువతి ప్రాణాలను కాపాడారు రైల్వే సిబ్బంది. అనంతరం ఆమెను […]
Duvvada Railway Station| విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న రైలు నుంచి కిందకు దిగుతుండగా.. ఓ విద్యార్థిని కాలు జారింది. దీంతో ఆమె రైలు - ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్లోనే నిలిపివేశారు.
బాధిత విద్యార్థినిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితురాలు గంటన్నర పాటు నరకయాతన అనుభవించింది. చివరకు ప్లాట్ ఫామ్ను పగులగొట్టి యువతి ప్రాణాలను కాపాడారు రైల్వే సిబ్బంది. అనంతరం ఆమెను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
రైలు – ప్లాట్ ఫామ్ మధ్య ఇరుకున్న విద్యార్థిని.. గంటన్నర నరకయాతన https://t.co/4nryC3wuea pic.twitter.com/jFwHPfCgL8
— vidhaathanews (@vidhaathanews) December 7, 2022
ఏం జరిగిందంటే..?
అన్నవరానికి చెందిన శశికళ(20) దువ్వాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇవాళ ఉదయం గుంటూరు - రాయఘడ ప్యాసింజర్ ఎక్కి.. దువ్వాడకు చేరుకుంది.
అక్కడ రైలు దిగుతుండగా కాలు జారడంతో ఆమె రైలుకు - ప్లాట్ ఫామ్కు మధ్య ఇరుక్కుపోయింది. నడుము బాగా వత్తుకు పోవడంతో తీవ్ర ఇబ్బంది పడింది. ఏం కాదు.. సురక్షితంగా కాపాడుతామని రైల్వే సిబ్బంది బాధితురాలికి ధైర్యం చెప్పారు. కానీ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.