Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. ఇటీవల వరుసగా ధరలు రోజు రోజుకు దిగివస్తున్నాయి. దేశ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం సైతం తగ్గుముఖం పట్టాయి.
22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 తగ్గి.. రూ.56,100కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 వరకు తగ్గి రూ.61,200కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,350 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ.61,200 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పసడి రూ.56,500 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,640 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,200 వద్ద ట్రేడవుతున్నది. విజయవాడ, విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశంలో వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రూ.100 తగ్గి రూ.74,500కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,100 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో ప్లాటీనం ధరలు స్వల్పంగా పెరిగింది రూ.130 పెరిగి.. రూ.28,300 వద్ద కొనసాగుతున్నది.
HOROSCOPE | 21.05.2023 దిన (రాశి) ఫలాలు.. ఆ రాశుల వారికి వృత్తిపరమైన ఇబ్బందులు
Gold Rate | కొనుగోలుదారులకు షాక్..! మళ్లీ రూ.56వేలు దాటిన పుత్తడి ధర.. హైదరాబాద్లో ఎంత ఉందంటే..?
Weekly Horoscope | మే 21 నుంచి 27 వరకు వార (రాశి) ఫలాలు.. వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు