Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.140 పెరిగి తులానికి రూ.55,050కి చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడిపై రూ.150 పెరిగి.. తులానికి రూ.60,050కి పెరిగింది. దేశవ్యాప్తంగా పలునగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,210 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం […]

Gold Rate |
బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.140 పెరిగి తులానికి రూ.55,050కి చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడిపై రూ.150 పెరిగి.. తులానికి రూ.60,050కి పెరిగింది.
దేశవ్యాప్తంగా పలునగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,210 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,050కి చేరింది. చెన్నైలో 22క్యారెట్ల స్వర్ణం రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,440 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మంగళవారం వెండి ధరలు పతనమయ్యాయి.
కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.74,500 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్లో కిలో వెండి 78,200 పలుకుతోంది. అలాగే ప్లాటినం ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. తులానికి రూ.80 పెరిగి.. ప్రస్తుతం రూ.24,760 వద్ద ట్రేడవుతున్నది.
