విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ (paper leakage) పై గవర్నర్ తమిళసై (Governor Tamilisai) పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్టీయూ (JNTU) స్నాతకోత్సవం (graduation ceremony)లో ఆమె మాట్లాడుతూ
ఒకప్పుడు విద్యార్థులు అన్ని పరీక్షలకు సమాధానం రాసేవారని, ఇప్పుడు పరీక్షలకు హాజరైతే చాలు అన్నట్లుగా ఉన్నారన్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడం కంటే ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు.