విధాత, హైదరాబాద్‌: సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. వాహ‌నాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పోలీసులు లోప‌లికి పంపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులు క‌మిష‌న‌రేట్ కు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో భ‌ద్ర‌త పెంచారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కు ముగ్గురు నిందితులు వెళ్తున్నారు. బేగంబజార్‌లో భారీగా డబ్బు పట్టివేత బేగంబజార్‌లో భారీగా డబ్బు పట్టుబడింది. కేవల్‌రామ్‌ అనే వ్యాపారి దగ్గర రూ.48.50 లక్షలు సీజ్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ […]

విధాత, హైదరాబాద్‌: సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. వాహ‌నాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పోలీసులు లోప‌లికి పంపిస్తున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులు క‌మిష‌న‌రేట్ కు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో భ‌ద్ర‌త పెంచారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కు ముగ్గురు నిందితులు వెళ్తున్నారు.

బేగంబజార్‌లో భారీగా డబ్బు పట్టివేత

బేగంబజార్‌లో భారీగా డబ్బు పట్టుబడింది. కేవల్‌రామ్‌ అనే వ్యాపారి దగ్గర రూ.48.50 లక్షలు సీజ్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. నగదు, వ్యాపారిని బేగంబజార్‌ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. వ్యాపారికి నోటీసులు ఇచ్చినట్లు బేగంబజార్ పోలీసులు చెప్పారు.

Updated On 28 Oct 2022 2:52 PM GMT
Somu

Somu

Next Story