UP  విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఘోరం జ‌రిగింది. ఓ జువైన‌ల్ హోమ్‌లోని బాలిక‌ల‌ను సూప‌రింటెం డెంట్ తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. మంచానికి క‌ట్టేసి, చెప్పుతో చిత‌క‌బాదారు. ఆ దెబ్బ‌ల‌కు చిన్నారులు త‌ల్ల‌డిల్లిపోయారు. సూప‌రింటెండెంట్ వేధింపులు తాళ‌లేక కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. చిన్నారుల‌ను చిత‌క‌బాదిన సూప‌రింటెండెంట్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో సూప‌రింటెండెంట్ పూన‌మ్ పాల్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు. ఆమెపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు […]

UP

విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఘోరం జ‌రిగింది. ఓ జువైన‌ల్ హోమ్‌లోని బాలిక‌ల‌ను సూప‌రింటెం డెంట్ తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. మంచానికి క‌ట్టేసి, చెప్పుతో చిత‌క‌బాదారు. ఆ దెబ్బ‌ల‌కు చిన్నారులు త‌ల్ల‌డిల్లిపోయారు.

సూప‌రింటెండెంట్ వేధింపులు తాళ‌లేక కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. చిన్నారుల‌ను చిత‌క‌బాదిన సూప‌రింటెండెంట్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో సూప‌రింటెండెంట్ పూన‌మ్ పాల్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు. ఆమెపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సోమ‌వారం రోజు ఓ అమ్మాయిని మంచానికి క‌ట్టేసి హింసించింది. మ‌రో ఆరుగురు అమ్మాయిల‌ను మూడు మంచాల‌పై ఉంచి, తీవ్రంగా కొట్టింది. పూన‌మ్ పాల్ చిన్నారుల‌ను కొడుతుంటే.. మ‌రో ఉద్యోగిని చూస్తూ ఉండిపోయింది. మంగ‌ళ‌వారం రోజు కూడా ఓ అమ్మాయిని మంచానికి క‌ట్టేశారు. అమ్మాయి తాళ్ల‌ను తీసేసేందుకు ప్ర‌య‌త్నించింది.

ఈ ఘ‌ట‌న‌పై ఆగ్రా డివిజ‌న్ క‌మిష‌న‌ర్ రితూ మ‌హేశ్వ‌రి స్పందించారు. జువైన‌ల్ హోమ్ సూప‌రింటెండెంట్‌తో పాటు ఇత‌ర సిబ్బందిని కూడా స‌స్పెండ్ చేశామ‌న్నారు. జిల్లా మెజిస్ట్రేట్ విచార‌ణ‌కు ఆదేశించార‌ని తెలిపారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Updated On 15 Sep 2023 2:36 AM GMT
somu

somu

Next Story