విధాత: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేక పోయారు. యువతికి వేరే యువకుడితో వివాహం కాగా, ప్రియుడు ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ తన ప్రియుడ్ని ఆమె మరిచిపోలేకపోయింది. ఈ క్రమంలో మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన యాదగిరిగుట్ట సమీపంలోని బాహుపేట రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి మండలం బస్వాపూర్కు చెందిన ఉడుతల గణేశ్(25), […]
విధాత: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేక పోయారు. యువతికి వేరే యువకుడితో వివాహం కాగా, ప్రియుడు ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ తన ప్రియుడ్ని ఆమె మరిచిపోలేకపోయింది. ఈ క్రమంలో మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన యాదగిరిగుట్ట సమీపంలోని బాహుపేట రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి మండలం బస్వాపూర్కు చెందిన ఉడుతల గణేశ్(25), నలంద(23) గత కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే మూడేండ్ల క్రితం నలందకు యాదగిరిగుట్టకు చెందిన యాదగిరితో వివాహం అయింది. యాదగిరి వృత్తిరీత్యా గుట్టపై లడ్డూ తయారీ కేంద్రంలో పని చేస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి నలంద ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఇంటికి వచ్చి చూసేసరికి నలంద కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెళ్లికి ముందే గణేశ్తో నలంద ప్రేమ వ్యవహారం
పెళ్లికి ముందు నుంచే గణేశ్తో నలంద ప్రేమలో ఉంది. కానీ పెద్దలను ఎదురించలేక, తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి సంబంధాన్నే చేసుకుంది. కానీ గణేశ్ను మాత్రం నలంద మరిచి పోలేకపోయింది. దీంతో తన ప్రియుడితో కలిసి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది నలంద.
బుధవారం ఉదయం బాహుపేట రైల్వే పట్టాల వద్ద ఇద్దరు మృతదేహాలను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని బస్వాపూర్ గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. రాత్రి 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతులను నలంద, గణేశ్గా పోలీసులు గుర్తించారు.