విధాత: బీజేపీ నుంచి తనను ఎవరు సంప్రదించలేదని, ఆత్మ సంతృప్తితో ఉన్నానని, సికింద్రాబాద్లో ఉంటానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వాస్తవం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రగతిభవన్కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డు లేదన్నారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రానా నేను మారను అన్నారు. కిషన్రెడ్డికి […]
విధాత: బీజేపీ నుంచి తనను ఎవరు సంప్రదించలేదని, ఆత్మ సంతృప్తితో ఉన్నానని, సికింద్రాబాద్లో ఉంటానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వాస్తవం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రగతిభవన్కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డు లేదన్నారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రానా నేను మారను అన్నారు.
కిషన్రెడ్డికి నాకు సంబంధాలు ఉన్నాయి. అవి ఎలాంటి సంబంధాలు అసెంబ్లీలో నేను అతను పక్క పక్క సీట్లో కూర్చునేవాళ్లం. వాస్తవానికి ఏం జరిగింది అంటే.. మా కూతురు పెళ్లి అయ్యింది. కిషన్రెడ్డి ఆహ్వాంచాను. అప్పుడు ఆయన హైదరాబాద్లో లేరు, ఢిల్లీలో ఉన్నారని చెప్పారు. పెళ్లి అయిపోయిన తర్వాత కిషన్రెడ్డి మా ఇంటికి వచ్చి మా కూతురిని ఆశీర్వదించారు. అయితే బీజేపీ నేతలు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పద్మారావు మండిపడ్డారు.