హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దేహశుద్ది తప్పదు..
నరేష్ పై PD ఆక్టు కేసు నమోదుకు బీజేపీ డిమాండ్ నరేష్ దిష్టిబొమ్మ దహనం విధాత, నిజామాబాదు: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హిందూ దేవుడు అయ్యప్ప మాలాధారణను కించపరుస్తూ మాట్లాడిన బైరి నరేష్ పై పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బైరి నరేష్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ […]
- నరేష్ పై PD ఆక్టు కేసు నమోదుకు బీజేపీ డిమాండ్
- నరేష్ దిష్టిబొమ్మ దహనం
విధాత, నిజామాబాదు: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హిందూ దేవుడు అయ్యప్ప మాలాధారణను కించపరుస్తూ మాట్లాడిన బైరి నరేష్ పై పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బైరి నరేష్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఇక ముందు ఎవరైనా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ స్థాయిలో ఉన్న వారైనా, ఎవరైనా సరే వారికి దేహశుద్ది తప్పదని హెచ్చరించారు. నరేష్ పై పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా నాస్తికుల పేరిట చేసే పనులకి మధ్యలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను లాక్కొస్తున్నారని, ఆ మహనీయుని ఖ్యాతిని దిగజార్చే పరిస్థితికి తీసుకు రావడం బాధాకరమన్నారు.
బీజేపీ ఇలాంటి వాటిని సహించదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు విపుల్, మున్సిపల్ కౌన్సిలర్ లు నరేందర్, శ్రీనివాస్, రవి, నాయకులు సంతోష్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.